టీమ్ఇండియా ఆదివారం నుంచి ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. పెర్త్ వేదికగా ఆసీస్తో తొలి వన్డే జరగనుంది. అయితే ఈ మ్యాచ్ సమయంలో వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు అక్కడి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కాబట్టి మ్యాచ్ కాసేపు ఆగిపోయే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, వర్షం పడకూడదని క్రికెట్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.