ఒడిశాలో సోమవారం షాకింగ్ ఘటన జరిగింది. 2021 IAS బ్యాచ్కు చెందిన ధీమాన్ చక్మా రూ.10 లక్షలు లంచం తీసుకుంటూ విజిలెన్స్ అధికారులకు పట్టుబడ్డారు. ధరమ్గఢ్ జిల్లాకు చెందిన ఓ వ్యాపారి నుంచి ఆయన రూ20 లక్షలు డిమాండ్ చేశారు. రూ.10 లక్షలు తీసుకుంటుండగా అధికారులకు చిక్కారు. అనంతరం IAS ఇంట్లో సోదాలు నిర్వహించగా రూ. 47 లక్షల కట్టల కట్టల డబ్బులు లభ్యమయ్యాయి. దీంతో మొత్తం డబ్బును అధికారులు సీజ్ చేశారు. ఈ వీడియో వైరల్గా మారింది.