అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం నేపథ్యంలో స్పందించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలను కలిగి ఉండదని స్పష్టం చేసిన ఆయన, ప్రపంచం మరింత సురక్షితంగా మారుతోందన్నారు. చమురు సరఫరా సాధారణ స్థితికి చేరుకుందని, స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయిలో దూసుకెళ్తున్నాయని పేర్కొన్నారు. ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని, ధరలు తగ్గుముఖం పట్టాయని చెప్పారు. అమెరికా గతంలో కంటే మరింత బలంగా, సురక్షితంగా ఉందని ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ వేదికగా వెల్లడించారు.