AP: గుంటూరు జీజీహెచ్లో మరో స్క్రబ్ టైఫస్ మరణం నమోదైంది. నన్యా నాయక్ (77) అనే వ్యక్తి చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందారు. వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. ఆస్పత్రిలో చేరి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. స్క్రబ్ టైఫస్ నిర్ధారణ కాగా.. వైద్యులు చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. ప్రభుత్వం ఆస్పత్రిలో 11 యాక్టివ్ కేసులు ఉన్నాయి.