AP: డబ్బు, కుల, వారసత్వ రాజకీయాలు ప్రజాస్వామ్యానికి హానికరం అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. కష్టపడేవారే రాజకీయాల్లోకి రావాలని, విద్య, వైద్యం మాత్రమే ఉచితంగా ఇవ్వాలని ఆయన అభిప్రాయపడ్డారు. అమరావతే అన్ని ప్రాంతాలకు దగ్గరగా ఉండే రాజధాని అని ఆయన పేర్కొన్నారు. రాజకీయాల్లోకి రావాలనుకునేవారు నిజాయితీగా, కష్టపడే తత్వంతో ఉండాలని, అప్పుడే ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుందని ఆయన తెలిపారు.