ఆపరేషన్ సిందూర్తో ఎలాంటి నష్టం కలగలేదని పాకిస్తాన్ బుకాయిస్తున్నప్పటికీ.. భారీగా నష్టం కలిగినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇండోనేషియన్ ఎయిర్ ఫోర్స్ యూనివర్సిటీ నిర్వహించిన సెమినార్లో పాక్ 6 ఫైటర్ జెట్లు, 2 అవాక్స్ విమానాలు, 1 సీ-130 హెర్క్యూలెస్ను కోల్పోయినట్లు వెల్లడించారు. పలు వైమానిక స్థావరాలు ధ్వంసమయ్యాయని పేర్కొన్నారు. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ చేపట్టిన ఈ దాడులు పాక్కు గట్టిగానే గుణపాఠం చెప్పాయి.