అఫ్గానిస్తాన్పై అర్ధరాత్రి పాకిస్తాన్ బాంబుల వర్షం కురిపించి పదిమంది అమాయకుల ప్రాణాలు తీసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. మృతుల్లో చిన్నారులు కూడా ఉండటంతో దృశ్యాలు హృదయవిదారకంగా ఉన్నాయి. భారత్-అఫ్గానిస్తాన్ మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యంపై అక్కసుతోనే పాకిస్తాన్ ఈ దాడులకు పాల్పడిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దొంగదెబ్బ తీయడం, మాట తప్పడం, అమాయకుల ప్రాణాలు తీయడం పాకిస్తాన్కు కొత్త కాదని ఈ ఘటన మరోసారి నిరూపించిందని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.