అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్తో వాణిజ్య ఒప్పందం కుదిరిందని ప్రకటించిన ఆయన, భాగస్వామ్యం కోసం ఓ చమురు కంపెనీని వెతుకుతున్నామని తెలిపారు. కాగా, భవిష్యత్తులో పాకిస్థాన్ భారత్కు చమురు విక్రయించే అవకాశముందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. అయితే భారత్- పాక్ మధ్య సంబంధాలు సరిగ్గా లేవన్న విషయం తెలిసి కూడా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.