పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) కీలక నిర్ణయం తీసుకుంది. స్టార్ క్రికెటర్లు బాబర్ ఆజం, మహమ్మద్ రిజ్వాన్, షాహీన్ అఫ్రిదీలను T20 జట్టులో నుంచి తప్పించింది. త్వరలో బంగ్లాదేశ్, వెస్టిండీస్తో జరగనున్న T20 సిరీస్ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్. దక్షిణాఫ్రికాలో జరిగిన T20 సిరీస్లో రిజ్వాన్ నాయకత్వంలోని పాకిస్థాన్ జట్టు 0-2 తేడాతో ఓటమిపాలైంది. ఈ ఓటమి తర్వాతే బాబర్, రిజ్వాన్లను న్యూజిలాండ్, బంగ్లాదేశ్తో జరిగిన హోం సిరీస్లకు ఎంపిక చేయలేదు.