జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులతో ఎన్కౌంటర్ల సమయంలో వారి వద్ద నుంచి ఆధునిక సాంకేతికతతో కూడిన టెలికమ్యూనికేషన్ పరికరాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. పాక్ సైన్యం అవసరాలకు చైనా సంస్థలు వాటిని రూపొందించాయని.. కానీ, అవి ఇప్పుడు ఉగ్రమూకల చేతుల్లోకి వచ్చాయని తెలిపారు. ఈ పరికరాలు పాక్ నుంచి ఉగ్రసంస్థలకు శిక్షణ, ఆయుధాలు, మందుగుండు సామగ్రి అందుతున్నాయని సూచిస్తోందని చెప్పారు.