దేశంలోకి అక్రమంగా పాక్ నుంచి డ్రోన్ల సాయంతో ఆయుధాలను తీసుకొస్తున్న ముఠాను దిల్లీ పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి విదేశాల్లో తయారైన 10 అత్యాధునిక సెమీ ఆటోమెటిక్ పిస్టల్స్, 92 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇవి టర్కీ, చైనాలో తయారైనవిగా పోలీసులు తెలిపారు. ఈ నెట్వర్క్కు చెందిన 4 వ్యక్తులను అరెస్టు చేశారు. వీరిని లారెన్స్ బిష్ణోయ్, బాంబిహా, గోగి వంటి గ్యాంగ్ సభ్యులకు ఇవ్వాలని ప్లాన్ చేసినట్లు ప్రాథమికంగా తేలింది.