బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్కు ఓ పాన్ మసాలా బ్రాండ్ ప్రకటన కేసులో ఉపశమనం లభించింది. రాజస్థాన్లోని కోట జిల్లా వినియోగదారుల కమిషన్ విచారణపై నేషనల్ కన్స్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెస్సల్ కమిషన్ (NCDRC) స్టే విధించింది. ఇంద్ర మోహన్ సింగ్ అనే వ్యక్తి సల్మాన్ ఖాన్ నటించిన పాన్ మసాలా ప్రకటన తప్పుదోవ పట్టించేలా ఉందని ఫిర్యాదు చేయడంతో ఈ కేసు మొదలైంది.