బిహార్లోని గయా జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తమ కొడుకును కొట్టిన టీచర్పై తల్లిదండ్రులు దాడికి పాల్పడ్డారు. ఐదో తరగతిలో ఇద్దరు పిల్లలు కొట్టుకోవడంతో టీచర్ రాకేశ్ వారిని ఆపి చెంపదెబ్బలు కొట్టారు. అందులో ఒక పిల్లాడు తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయడంతో వారు రాకేశ్తో పాటు అడ్డొచ్చిన సహోద్యోగిపై పిడిగుద్దులు కురిపించారు. అనంతరం కర్రలతో దారుణంగా కొట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.