ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఏపీలో పార్టీ విజయం సాధించడంతో తెలంగాణలో కూడా పార్టీని గాడిలో పెట్టాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగానే తెలంగాణలో సైకిల్ను తిరిగి రేస్లో తెచ్చేందుకు చంద్రబాబు మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్లు సమాచారం. దీనిలో భాగంగానే బ్రాహ్మిణిని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించే ఆలోచనలో ఉన్నారని పొలిటికల్ సర్కిల్స్లో చర్చ నడుస్తోంది.