పవన్ కల్యాణ్ మాజీ భార్య, నటి రేణూ దేశాయ్ తాజాగా షేర్ చేసిన ఇన్స్టా స్టోరీ నెట్టింట వైరల్గా మారింది. ఆమె తన కూతురు ఆద్యతో దిగిన ఫోటోను పంచుతూ "సర్జరీ తర్వాత డిన్నర్ డేట్కి వెళ్లాం" అని పేర్కొనడంతో ఫ్యాన్స్ ఆందోళనకు గురయ్యారు. రేణూదేశాయ్కు ఏమైంది? ఏ సర్జరీ జరిగింది? అనే చర్చలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆమె ఆరోగ్యంపై అభిమానులు ఆప్యాయంగా స్పందిస్తున్నారు.