మల్లన్న ఆలయానికి రూ. 1 కోటి 35 లక్షలు

ప్రభుత్వ విప్ విజయరమణారావు మంగళవారం ఓదెల శ్రీ మల్లికార్జునస్వామి ఆలయ అభివృద్ధి పనులకు రూ. 1 కోటి 35 లక్షలు మంజూరు చేయించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా శివపల్లిలోని ఆయన నివాసంలో ఆలయ పాలక మండలి చైర్మన్ చీకట్ల మొండయ్య ఆధ్వర్యంలో పాలకవర్గం, ఈఓ సదయ్య, అర్చకులు, సిబ్బంది విజయరమణారావు దంపతులను ఘనంగా సన్మానించి, ఆశీర్వచనములు అందజేశారు. ఆలయాన్ని ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్