పెద్దపల్లి జిల్లా మంథని నుండి గత నెలలో శబరిమల మహా పాదయాత్రకు వెళ్లిన స్వాములు, 50 రోజుల యాత్రను విజయవంతంగా ముగించుకొని మంథని చేరుకున్నారు. అయ్యప్ప ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం స్వాములను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప కమిటీ సభ్యులు, స్వాములు పాల్గొన్నారు. అధ్యక్షులు వొడ్నాల శ్రీనివాస్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరిచారు.