పెద్దపల్లి జిల్లా మంథనిలో సోమవారం ఉదయం గోదావరిలో స్నానానికి వెళ్లిన ఆర్యవైశ్య యువకుడు రావికంటి సాయి కాలుజారి లోతులో పడి కొట్టుకుపోయాడు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, ఈ ఘటనపై సమాచారం అందుకున్న మంథని పోలీసులు, ఫైర్ శాఖ, మున్సిపల్ కమిషనర్ సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు.