పెద్దపల్లి మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్, రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం సుల్తానాబాద్లో జరిగిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాట్లాడుతూ, పార్లమెంట్ పరిధిలోని మున్సిపాలిటీలలో కాంగ్రెస్ జెండా ఎగురవేసేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. గెలుపు గుర్రాలకు టికెట్లు కేటాయిస్తామని, ఆశావహులు నిరాశ చెందకుండా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి మరింత అభివృద్ధికి కృషి చేయాలని ఆయన సూచించారు. ఈ సమావేశానికి పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు అధ్యక్షత వహించారు.