జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామంలో బుధవారం రాత్రి సరళమ్మ అమ్మవారి ఊరేగింపు అంగరంగ వైభవంగా జరిగింది. డబ్బు, చెప్పులు, డప్పులు, వాయిద్యాల నడుమ గ్రామ వీధుల గుండా అమ్మవారిని ఊరేగింపుగా తీసుకెళ్లి గద్దెలపై ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, యువకులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించారు. భక్తిశ్రద్ధలతో గ్రామం మొత్తం పండుగ వాతావరణంగా మారింది.