ఉద్యోగ విరమణ రోజే పింఛను మంజూరు

ఈపీఎఫ్‌వో పరిధిలోని వచ్చే కార్మికులు, ఉద్యోగులకు ‘ప్రయాస్‌’ పథకం కింద ఉద్యోగ విరమణ రోజే పింఛను మంజూరు చేయనున్నారు. ఈ పథకం అమల్లోకి వచ్చి నాలుగేళ్లు అయినా పలు కారణాలతో పీపీవోలు మంజూరు చేయలేదు. దీనిపై యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేసింది. జోనల్‌ కార్యాలయాలు పరిశ్రమలు, సంస్థల యజమానులకు, మూడునెలల్లో ఉద్యోగ విరమణ చేయనున్న ఉద్యోగులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అదనపు కేంద్ర పీఎఫ్‌ కమిషనర్‌ అప్రజిత జగ్గీ ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్