టీమ్ ఇండియాను చూసి దేశ ప్రజలు గర్వించాలని ప్రధాని మోదీ అన్నారు. 132వ మన్కీ బాత్ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ, భారత పురుషుల క్రికెట్ జట్టు వరల్డ్ కప్ విజయం దేశవ్యాప్తంగా ఆనందాన్ని నింపిందన్నారు. ఇతర క్రీడల్లోనూ భారత ఆటగాళ్లు రాణిస్తున్నారని పేర్కొన్న ఆయన, గుల్వీర్ సింగ్ న్యూయార్క్ హాఫ్ మారథాన్లో మూడో స్థానం సాధించడాన్ని అభినందించారు. అలాగే అనాహత్ సింగ్ స్క్వాష్ ఆన్ ఫైర్ ఓపెన్ 2026 గెలుపుతో పాటు ప్రపంచ ర్యాంకింగ్స్లో టాప్-20లో నిలవడం గొప్ప విజయమన్నారు.