ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద నిరసనను లక్ష్యంగా చేసుకుని పెట్రోల్ బాంబు దాడికి పన్నాగం పన్నిన ఐఎస్ఐ మద్దతుగల ఉగ్ర మాడ్యూల్ను పంజాబ్ పోలీసులు భగ్నం చేశారు. ఈ కేసులో 8 మందిని అరెస్టు చేయగా, అమృత్సర్లో మరో రెండు మాడ్యూళ్లను ఛేదించి నలుగురు మైనర్లతో సహా 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి పిస్టల్స్, పెట్రోల్ బాంబులు, తూటాలు స్వాధీనం చేసుకుని, ఆర్థిక లావాదేవీలు, కుట్రపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.