పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు నెలల క్రితం దిగుమతి చేసుకున్న అధిక ధరల ముడి చమురు నిల్వల ఆధారంగా ప్రస్తుత ధరలు నిర్ణయించబడ్డాయని, ఆ చమురును ప్రాసెస్ చేస్తున్నందున ధరల తగ్గింపునకు సమయం పడుతుందని ఆయన తెలిపారు. ముడి చమురు ధరలు స్థిరంగా తగ్గితేనే మళ్లీ సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని ఆయన వివరించారు.