ఛత్తీస్గఢ్ రాయ్పూర్లో గురువారం దారుణం జరిగింది. మందిర్ హసౌద్ సమీపంలోని జాతీయ రహదారిపై పెట్రోల్ బంక్లో దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. ఇద్దరు పెట్రోల్ బంక్ ఉద్యోగులపై నిందితులు సమీర్ టాండ్, కునాల్ తివారీ కత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో సూపర్వైజర్ ప్రాణాలు కోల్పోయాడు. హత్యకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది. నిందితులిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు.