ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కీలక దశకు చేరింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, అనారోగ్యం, ఎన్నికల బిజీ కారణంగా తన ఫామ్ హౌసుకే రావాలని సిట్కు లేఖ రాశారు. అయితే దీనిని నిరాకరించిన సిట్ అధికారులు ఆదివారం నందినగర్లోని నివాసానికి రావాలని స్పష్టం చేస్తూ నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో సిట్ నోటీసులను సవాలు చేస్తూ కేసీఆర్ నేడు హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్నట్లు సమాచారం.