మహారాష్ట్ర బారామతిలో జరిగిన ఘోర విమాన ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది. ప్రమాదాన్ని చివరి క్షణాల్లో పైలట్లు గుర్తించినట్టు బ్లాక్బాక్స్ విశ్లేషణలో వెల్లడైంది. ప్రమాదాన్ని గమనించిన వెంటనే కాక్పిట్లో పైలట్ ‘ఓహ్ షి**’ అంటూ పలికిన మాటలు రికార్డయ్యాయని డీజీసీఏ అధికారులు తెలిపారు. అయితే అప్పటికే పరిస్థితి అదుపు తప్పడంతో విమానంలో ఉన్నవారంతా మృతి చెందినట్టు పేర్కొన్నారు. ఈ ఘటనపై విమాన ప్రమాద దర్యాప్తు బ్యూరో (ఏఏఐబీ) విచారణ చేపట్టింది.