ప్రో కబడ్డీ (PKL 2025)లో తెలుగు టైటాన్స్ జట్టు దుమ్ము రేపింది. ఎలిమినేటర్ 3 మ్యాచ్లో మంగళవారం పాట్నా పైరేట్స్పై 46-39 తేడాతో గెలిచింది. తెలుగు టైటాన్స్ జట్టులో రైడర్ భరత్ 23 పాయింట్లతో చెలరేగాడు. పాట్నా పైరేట్స్ జట్టులో రైడర్ అయాన్ 22 పాయింట్లు సాధించినా ఆ జట్టు ఓటమి పాలైంది. ఇక బుధవారం రాత్రి 8 గంటలకు పుణెరి పల్టాన్ జట్టుతో తెలుగు టైటాన్స్ జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్ గెలిస్తే ఫైనల్ చేరుకుంటుంది.