అహ్మదాబాద్లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో ఇప్పటివరకు 110 మంది ప్రయాణికులు మృతి చెందినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. అయితే విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు ఉన్న సంగతి తెలిసిందే. కాగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక విమానంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నట్లు టాక్. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.