అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంలో బ్లాక్ బాక్స్ ఇంకా దొరకలేదని ఎయిరిండియా తెలిపింది. గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు పేర్కొంది. అయితే బ్లాక్ బాక్స్ దొరికితే ప్రమాదానికి గల కారణాలు తెలిసే అవకాశం ఉంది. కాగా అహ్మదాబాద్లో గురువారం ఎయిరిండియా విమానం కుప్పకూలడంతో మొత్తంగా 265 మంది చనిపోయారు. ఈ ప్రమాదం నుంచి ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు.