నేపాల్లోని భద్రాపూర్లో ల్యాండింగ్ సమయంలో బుద్ద ఎయిర్కు చెందిన ఏటీఆర్-72 విమానం రన్వే పైనుంచి పక్కకు దూసుకెళ్లింది. ఖాట్మండు నుంచి వచ్చిన ఈ విమానంలో 51 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నట్లు సమాచారం. రన్వే దాటి 200 మీటర్ల దూరం ముందుకు దూసుకెళ్లడంతో విమానం స్వల్పంగా దెబ్బతింది. ఈ ఘటనలో ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారు.