భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతోన్న రెండో టెస్టులో నాలుగో రోజు ఆట ముగిసింది. రెండో ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా 260/5 వద్ద డిక్లేర్ చేసింది. దీంతో భారత్కు 549 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించబడింది. లక్ష్య ఛేదనకు దిగిన భారత్ ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 27 పరుగులు చేసింది. ఓపెనర్లు జైస్వాల్(13), రాహుల్(6) విఫలమయ్యారు. భారత్ విజయం సాధించాలంటే చివరి రోజు 522 పరుగులు చేయాల్సి ఉంటుంది.