ఉత్తరప్రదేశ్ అంతర్జాతీయ విమానాశ్రయం తొలి దశను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల యుద్ధం వల్ల ప్రపంచ దేశాలు ఇంధన కొరతతో సహా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని తెలిపారు. ఈ సవాళ్లను భారత్ సమర్థంగా ఎదుర్కొంటోందన్నారు. ప్రజలు, రైతులపై భారం పడకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. సంక్షోభ సమయంలోనూ దేశంలో అభివృద్ధి కొనసాగుతోందని, ప్రజలు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.