రంజాన్ పండుగను పురస్కరించుకొని ప్రధాని మోదీ ముస్లిములకు రంజాన్ తోఫా ఇవ్వనున్నట్లు బీజేపీ ప్రకటించింది. దేశ వ్యాప్తంగా 32 లక్షల మంది ముస్లిం కుటుంబాలకు ఈద్కు ఒక రోజు ముందు ‘సౌగత్-ఇ-మోదీ’ పేరిట తోఫా కిట్లను పంపిణీ చేయనున్నారు. ఈ కిట్లలో కొత్త దుస్తులు, సేమియాలు, ఖర్జూరపు పండ్లు, డ్రై ఫ్రూట్స్, చక్కెర, శనగపిండి, నెయ్యి లేదా డాల్డా ఉంటాయని, కార్యకర్తల ద్వారా వీటిని పంపిణీ చేయనున్నట్లు బీజేపీ శ్రేణులు తెలిపాయి.