యురోపియన్ ఫుట్బాల్ ఛాంపియన్స్ లీగ్ ఫైనల్లో ఆర్సెనల్పై పీఎస్జీ విజయం సాధించడంతో పారిస్లో అభిమానులు సంబరాల పేరుతో రెచ్చిపోయారు. రోడ్లపై వాహనాలకు నిప్పు పెట్టడం, ఈఫిల్ టవర్ వద్ద ఉద్రిక్తతలకు దిగడంతో పోలీసులు రంగంలోకి దిగి 280 మందిని అరెస్ట్ చేశారు. శాంతిభద్రతల దృష్ట్యా మెట్రో స్టేషన్లు, ట్రామ్ లైన్లు, బస్సుల రాకపోకలను అధికారులు పూర్తిగా నిలిపివేశారు.