హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు, నటి లావణ్య నార్సింగి పోలీస్ స్టేషన్ను మరోసారి ఆశ్రయించారు. బిగ్ బాస్ ఫేమ్ ఆర్జే శేఖర్ బాషాపై ఆమె ఫిర్యాదు చేశారు. ఆమెను మస్తాన్ సాయి, శేఖర్ డ్రగ్స్ కేసులో ఇరికించేందుకు కావాలనే కుట్ర చేశారంటూ ఆరోపించారు. మస్తాన్, బాషాకు సంబంధించిన ఆడియోలను పోలీసులకు ఆమె అందజేశారు. తనతోపాటు మరో యువతిని సైతం డ్రగ్స్ కేసులో ఇరికించేందుకు వారిద్దరూ యత్నించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.