TG: లంచం తీసుకుంటుండగా ఇద్దరు అధికారులను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. శంషాబాద్ పరిధిలోని రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఓ కేసులో అరెస్టు చేయకుండా చూడాలని బాధితుడు కోరగా.. సీఐ యూ.కె సిద్దేశ్వర్, ఎస్సై సంపతిలు రూ. 5 లక్షలు డిమాండ్ చేశారు. ఇందులో మొదటి విడతగా రూ.2 లక్షలు తీసుకుంటుండగా రెడ్హ్యండెడ్గా పట్టుబడ్డారు. ఏసీబీ అధికారులు ఇద్దరిని అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు.