పశ్చిమ బెంగాల్లో చివరి దశ పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు 90 శాతం నమోదైంది. మొత్తం 294 స్థానాలకు తొలి దశలో 152 చోట్ల, రెండో దశలో మిగిలిన 142 సీట్లలో పోలింగ్ పూర్తయింది. మే 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. తమిళనాడు, పశ్చిమబెంగాల్, అస్సాం, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ మరికాసేపట్లో వెలువడనున్నాయి.