TG: షాబాద్ హత్యల నిందితుడు రాజ్కుమార్ సోమవారం చనిపోయిన విషయం తెలిసిందే. తాజాగా అతడి మృతదేహానికి చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం పూర్తైంది. రాజ్కుమార్ మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు కుటుంబసభ్యులు నిరాకరించారు. చేవెళ్లలోనే అంత్యక్రియలు నిర్వహించాలని పోలీసులు నిర్ణయించారు. చేవెళ్ల శ్మశానవాటికలో మున్సిపల్ సిబ్బంది అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు.