ప్రధాని నరేంద్ర మోదీ అహ్మదాబాద్కు చేరుకున్నారు. మాన ప్రమాద ఘటన స్థలాన్ని ఆయన పరిశీలించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శిస్తారు. కాగా అహ్మదాబాద్లో గురువారం ఎయిరిండియా విమానం కుప్పకూలగా అందులో 241 మంది, ఈ విమానం వైద్యకళాశాలపై కూలడంతో మరో 24 మంది మృతి చెందారు. మొత్తంగా ఈ ఘటనలో 265 మంది ప్రాణాలు కోల్పోయారు.