ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం నావీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఘనంగా ప్రారంభించారు. కొత్తగా నిర్మించిన ఈ విమానాశ్రయంలో మోదీ స్వయంగా దిగి, టెర్మినల్ను పరిశీలించారు. ₹19,650 కోట్లతో నిర్మించిన ఈ ఎయిర్పోర్ట్ భారత్లో తొలి డిజిటల్ ఎయిర్పోర్ట్గా నిలిచింది. దీంతో ఛత్రపతి శివాజీ ఎయిర్పోర్ట్లో రద్దీ తగ్గనుంది. ప్రారంభ వేడుకకు సీఎం ఫడ్నవీస్, అజిత్పవార్, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తదితరులు హాజరయ్యారు.