కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంకాగాంధీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. రానున్న లోక్సభ ఉప ఎన్నికల్లో ప్రియాంక వయనాడ్ నుంచి రాజకీయ అరంగేట్రం చేయనున్నారని ఇటీవల కాంగ్రెస్ ప్రకటించింది. ఇందులో భాగంగా ప్రియాంకకు మద్దతుగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వయనాడ్లో ప్రచారం చేసే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. రాహుల్ గాంధీ అక్కడి నుంచే పోటీ చేసి గెలుపొందారు. అయితే అ స్థానాన్ని వదులుకోవడంతో ప్రియాంక పోటీకి దిగుతున్నారు.