ఒడిశాలో 20 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్యపై రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చోటుచేసుకున్నాయి. కాలేజీ లెక్చరర్ వేధింపులు తాళలేక 20 ఏళ్ల విద్యార్థిని ఒంటిపై నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. ప్రభుత్వ తీరుకు నిరసనగా బుధవారం భువనేశ్వర్లో అసెంబ్లీ వద్ద బీజేడీ కార్యకర్తలు ఆందోళనకు దిగగా, వారిని నియంత్రించేందుకు పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ ఫిరంగి ఉపయోగించారు.