లద్ధాఖ్కి రాష్ట్రహోదా కల్పించడంతోపాటు, ఆరో షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ లెహ్లో జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. బీజేపీ కార్యాలయం, వాహనాన్ని తగలబెట్టారు. ఈ ఘర్షణల్లో నలుగురు మృతి చెందగా, 90 మందికిపైగా గాయపడ్డారు. కర్ఫ్యూ విధించిన అధికారులు, గురువారం సోదాలు జరిపి 50 మందిని అరెస్టు చేశారు. శాంతిభద్రతల కోసం సీఆర్పీఎఫ్, ఐటీబీపీ, స్థానిక పోలీసులు మోహరించబడ్డారు.