హైదరాబాద్లో మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. ఐదేళ్ల తర్వాత భారీ వరద పోటెత్తి బాపూఘాట్ నుంచి దిగువ ప్రాంతాలను ముంచెత్తుతోంది. పురానాపూల్ వంతెన వద్ద నీటి మట్టం 13 అడుగులకు చేరింది. ఎంజీబీఎస్లోకూ వరద నీరు చేరడంతో బస్సుల ప్రవేశాన్ని నిలిపివేశామని అధికారి సుఖేందర్ రెడ్డి తెలిపారు. వాహనాలను తాత్కాలికంగా మళ్లించినట్లు అధికారులు వెల్లడించారు.