భారతదేశ సాంకేతిక పురోగతికి గుర్తుగా ఈ 'నేషనల్ టెక్నాలజీ డే' జరుపబడుతుంది. సైన్స్ ప్రాముఖ్యతను తెలియజేయడానికి దేశంలోని వివిధ సాంకేతిక సంస్థలలో, ఇంజనీరింగ్ కళాశాలల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు. శాస్త్ర, సాంకేతికరంగంలో కృషిచేసిన వ్యక్తులకు, పరిశ్రమలకు ఈ దినోత్సవం రోజున అవార్డులు అందజేస్తారు. నూతన ఆవిష్కరణల గురించి తెలియజేయడంతో పాటూ ఆ ఫలాలను అందరికీ అందేలా చూడడం కూడా జరుగుతుంది.