అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో రేపు రిలీజ్ కానున్న పుష్ప -2 సినిమాపై జనసేన నేత నాగబాబు సంచలన ట్వీట్ చేశారు. '24 క్రాఫ్ట్ ల కష్టంతో వందల మంది టెక్నీషన్ల శ్రమతో వేల మందికి ఉపాధి కలిగించి, కోట్ల మందిని అలరించేదే *సినిమా*. సినిమాలను ఆదరించాలని, ప్రతి మెగా అభిమానిని, ప్రతి సినీ అభిమానిని కోరుకుంటున్నాను' అని పేర్కొన్నారు. అల్లు -మెగా ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో ఫైట్ జరుగుతున్న వేళ ఈ ట్వీట్ ఆసక్తికరంగా మారింది.