రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4, 5 తేదీల్లో భారత్లో పర్యటించనున్నారు. 2021 తర్వాత పుతిన్ భారత్లో పర్యటించడం ఇదే తొలిసారి. కాగా జులైలో ఇరుదేశాల శిఖరాగ్ర సమావేశంలో భాగంగా ప్రధాని మోదీ రష్యాకు వెళ్లారు. అక్టోబర్లో బ్రిక్స్ సదస్సు సందర్భంగా రష్యాలోని కజన్లో మరోసారి వీరిద్దరూ సమావేశమయ్యారు. ఇటీవల చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ సదస్సులో కూడా పుతిన్-మోదీలు భేటీ అయ్యారు.