కర్నూలు జిల్లా మహానందిలో వాటర్ ట్యాంకర్లో కొండచిలువ కలకలం రేపింది. శ్రీనగర్ ప్రాంతంలోని ఓ ఇంట్లో వాటర్ ట్యాంకర్లో భారీ కొండ చిలువ కనిపించింది. భయబ్రాంతులకు గురైన స్థానికులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకుని కొండచిలువను బంధించి సురక్షిత ప్రాంతంలో విడిచి పెట్టారు అధికారులు. కాగా ఆ భారీ కొండచిలువ ట్యాంకర్లోకి ఎలా చేరిందా అనే దాని పై అధికారులు ఆరా తీస్తున్నారు.