AP: టెకీ రాధాగాయత్రి తల్లిదండ్రులు శనివారం సీపీ శంఖబత్రబాగ్చిని కలిశారు. అల్లుడు శ్రీచరణ్పై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రాధాగాయత్రి తండ్రి సుధాకర్ మాట్లాడుతూ.. సీపీని కలిసిన తర్వాతే తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకం వచ్చిందన్నారు. శ్రీచరణే హత్య చేశాడని, తన కూతురు మృతిపై అనుమానాలు ఉన్నాయన్నారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు.